హైదరాబాద్: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు మంత్రి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. తెలంగాణకు యూరియా కోటా వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంత్రి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండటంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతులు వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు విరివిగా సాగు చేస్తారన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రాష్ట్ర వాటా కింద 1.40 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించాలని మంత్రి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.