రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.50లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక గుల్బర్గా నుంచి లారీలో గుట్కా తరలిస్తుండగా పట్టుకున్నారు. అధికారులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.