టెక్నాలజీలో ముందున్నామంటే అది రాజీవ్గాంధీ చలవే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడలో జరిగిన రాజీవ్గాంధీ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. దురదృష్టవశాత్తు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ, నెహ్రూ కుటుంబాలు తప్పు చేసినట్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. అమిత్షా పార్లమెంటులో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నెహ్రూ, పటేల్ వేరు వేరు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారన్నారు.