హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తీసుకోనున్నారు. కొత్త పంచాయతీరాజ్, పురపాలక చట్టాల అమలుపైనా చర్చించనున్నారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిర్దేశించిన 60 రోజుల కార్యాచరణపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.