మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో... నిర్లక్ష్యం వహించిన ఆర్డీవో, తహసీల్దార్కు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సిద్దిపేట జిల్లా తొగుట్ట ఆర్డీవో విజేందర్రెడ్డి, తహసీల్దార్ ప్రభుకు 2 నెలల జైలు శిక్ష, 2 వేల జరిమానాను హైకోర్టు విధించింది. దీంతో పాటు విజేందర్రెడ్డి, ప్రభులపై సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో... మరోసారి మల్లన్న సాగర్ బాధితులు కోర్టును ఆశ్రయించారు.