దేశంలో గత కొన్నేళ్లుగా అవాంఛనీయ ధోరణులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అసహనం, మతమౌఢ్యం, కొన్ని వర్గాల ద్వేషపూరిత ధోరణి వల్ల హింసాత్మక నేరాలు పెరుగుతున్నాయని, మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వీటివల్ల దేశానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన చెప్పారు.