ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా సింగాయపల్లికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సు, వాహనాల్లో సీఎంతో పాటు మంత్రులు, కలెక్టర్లు సింగాయపల్లికి చేరుకున్నారు. సింగాయపల్లిలో 1500 ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ సందర్శించి అటవీ ప్రాంత పునరుజ్జీవం పనులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా సింగాయపల్లి దగ్గర కేసీఆర్ మొక్కను నాటారు. రహదారుల వెంట మొక్కల పెంపకం, సామాజిక వనాల అభివృద్ధిని పరిశీలిస్తున్నారు. అనంతరం సీఎం, మంత్రులు, కలెక్టర్లు కోమటిబండకు వెళ్లనున్నారు