జేపీ నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్ అహంకార వైఖరికి నిదర్శనమని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ జేపీ నడ్డా ఎవరో తెలియదనడం మంచి సంస్కృతి కాదన్నారు. నడ్డా ఎవరో తెలియనప్పుడు… గతంలో కేటీఆర్ ఆయన్ను ఎలా కలిశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ లేక పోతే కవిత ఎలా ఓడిపోయారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పు విషయం కేంద్రం పరిధిలోకి రాదని అన్నారు. ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమం అయితే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. మా లక్ష్యం మున్సిపల్ ఎన్నికలు కాదని, 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు.