సిరిసిల్ల చీరలకు ఓ బ్రాండ్ గా మారలని తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జౌళిశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత చేనేతరంగ అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. నేతన్నలకు గౌరవం, భద్రతతో కూడిన జీవనోపాధి కల్పిస్తామన్నారు. సిరిసిల్లలో 40.50 కోట్ల మీటర్ల క్లాత్ కు ఆర్డర్ ఇచ్చామని, దీంతో నెలపాటు రైతన్నలకు జీవనోపాధి లభించిందన్నారు. 11 వేలమంది చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామని.. సిరిసిల్లలో చేనేత కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయని, కార్మికులను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామన్నారు.