వరంగల్: నగరంలోని హన్మకొండ నక్కలగుట్టలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తాగుడికి బానిసైన కొడుకు రేవంత్ రైల్వే పింఛను డబ్బులు ఇవ్వాలని తల్లిని దారుణంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు బాలమణిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.