ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 05:41 PM

తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడలేదని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, బాలూ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని, 2023 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com