సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈసారి వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రతి గ్రామం మొత్తానికి ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. అదీ మట్టివినాయకుడినే పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ కులాలు సంఘాలు కాలనీల వారీగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో ప్రమాదకర రసాయనాలు కలిపిన రంగులు వాడడం వల్ల నిమజ్జనం తర్వాత చెరువులు కలుషితమై చేపలు చనిపోయి.. ఆ సాగునీటితో పంటలు ఎండిపోయి దిగుబడి తగ్గుతోంది. పైగా వినాయక ఉత్సవాల మైక్ లతో ఊరు వాడ శబ్ధ కాలుష్యం.. ఇక కొన్నిచోట్ల యువకుల మధ్య ఆధిపత్య పోరుతో ఘర్షణలు.. ఇలా అన్నింటిని బేరీజు వేసుకొని ఇలా ఊరుకొక్కటి వినాయక విగ్రహం పెడితే బాగుంటుందని సూచించారు . దీనికి ‘ఏక వినాయక మహోత్సవం’గా పేరుపెట్టారు. ఇప్పటికే తొట్టతొలిగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఒకటే వినాయకుడి మట్టి విగ్రహం ఊరంతటికి పెట్టాలని తీర్మానించగా. మండలంలోని అన్ని గ్రామాలు ఇదే బాటలో నడుస్తున్నాయట..
సో హరీష్ రావు లక్ష్యం నెరవేరే సూచనలే కనిపిస్తున్నాయి.. ఇది తెలంగాణ వ్యాప్తంగా కొనసాగితే మాత్రం ప్రకృతిని మనమంతా కాపాడినవారమ వుతామనిపించడం లేదూ ?