జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో మేడిగడ్డ బ్యారేజీ 14 గేట్లు ఎత్తివేసి దిగువకు వదులుతున్నారు. బ్యారేజీలోకి 75,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుండగా అంతే క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 10.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.812 టీఎంసీలు ఉంది.