కొండగట్టు సమీపంలో ముత్యంపేటకు చెందిన లంక వంశీ అనే యువకుడిపై ముగ్గురు యువకులు హత్యాయత్నం చేశారు. రెండు కాళ్లు విరగొట్టి తీవ్ర గాయాల పాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. గాయాల పాలైన వంశీని చికిత్స నిమిత్తం జగిత్యాలకు తరలించారు.