హైదరాబాద్: బాచుపల్లి మండల రెవెన్యూ ఆఫీసర్(ఎమ్మార్వో) యాదగిరి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు డిమాండ్ చేసిన ఈ తహసీల్దార్ ఇప్పటికే యాబై వేలు తీసుకోగా, మరో యాబైవేలు తీసుకునే క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అతని ఇంటిలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అతనిపై విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఇతనిపై పలు అవినీతి ఆరోపణలున్నట్లు తెలుస్తోంది.