రాష్ట్రంలో బలమైన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పార్టీ నాయకులతో సభ్యత్వ నమోదుపై ఈ రోజు సమీక్ష నిర్వహించిన ఆయన నేటితో సభ్యత్వ నమోదు గడువు ముగిసిందనీ, పార్టీ సభ్యత్వాలు 60లక్షలు పూర్తయ్యాయని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ తెరాస కార్యాలయాల నిర్మాణాలను వేగవంతం చేస్తామని చెప్పారు.