మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. తిప్పన్నగుల్ల గ్రామంలో దివాకర్ అనే వ్యక్తి తండ్రి చనిపోతే లోన్ మాఫీ అయిపోతుందని తండ్రినే చంపేశాడు. దివాకర్ తండ్రిపై ట్రాక్టర్ లోన్ ఉండగా మనిషి చనిపోతే లోన్ మాఫీ అయిపోతుంది. దీంతో పక్క ప్లాన్ ప్రకారం కరెంట్ షాక్ ఇచ్చి తండ్రిని చంపేశాడు. స్థానికుల అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో దివాకర్ నిజం ఒప్పుకున్నాడు.