గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి వాగులో పడేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపెల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వాగులో లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య చేసి వాగులో పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.