హరితహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సరీల్లో మొక్కలను విరివిగా పెంచుతున్నారు. అయితే వికారాబాద్ జిల్లా పరిధిలోని చిలుకూరు ఆలయం ఏర్పాటు చేసిన నర్సరీలోకి మేకలు ప్రవేశించాయి. ఆ తర్వాత అక్కడున్న మొక్కలన్నింటినీ మేకలు తినేశాయి. దీంతో మేకల యజమానికి చిలుకూరు పంచాయతీ కార్యదర్శి రూ. 500 జరిమానా విధించారు. మేకల యజమాని నుంచి జరిమానాను వసూలు చేశారు పంచాయతీ కార్యదర్శి.