శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని గగన్పహాడ్లో మూడేళ్ల చిన్నారి అపహరణకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన శ్రావణ్ దంపతులు గగన్పహాడ్లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.. చిన్న కుమార్తె మూడేళ్ల శ్రద్ధ ఇంటిముందు ఆడుకుంటూ గురువారం సాయంత్రం కనిపించకుండా పోయింది. పరిసర ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సోదాలు నిర్వహించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఓ ఆగంతకుడు పాపను తీసుకెళ్లాడని స్థానికులు చెబుతున్నారు.