అక్టోబర్ 13న హైదరాబాద్ లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే డిమాండ్తో మాదిగల సమర భేరి బహిరంగసభ నిర్వహించనున్నట్టు మాదిగ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీఇచ్చిన కేంద్రం వెయ్యి రోజులైనా దానిఊసే ఎత్తడం లేదని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు, ఈబీసీ రిజర్వేషన్లను ఎవరిని అడుగకుండా చేసిన కేంద్రం.. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నా, తెలంగాణ అసెంబ్లీ తీర్మానం సైతంచేసినా ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో టీఎస్ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, ఇటుకరాజు, మైస ఉపేందర్, రాయకంటి రాందాస్ పాల్గొన్నారు.