ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ క్రైం పోలీసులకు "జనసేన" ఫిర్యాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 05:45 PM

సామాజిక మాధ్యమాలు వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాలు వేదికగా ‘జనసేన’పై జరుగుతున్న దుష్ప్రచారానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రూ.2 వేల కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా ఆయన మార్చారంటూ సోషల్ మీడియా ద్వారా వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com