జనగాం జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గీతకార్మికుడు సట్ల యాకయ్య(42) మోకు జారడంతో తాటిచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతుని కుంటుబీకులకు ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.