పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం దక్కింది. స్వీడన్లో ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే ప్రపంచ నీటి వారోత్సవాల్లో కేంద్ర తాగునీటి, పారిశుధ్య శాఖ కార్యదర్శి పరమేశ్వర్ అయ్యర్ నేతృత్వలోని ప్రతినిధుల బృందం పాల్గొననుంది. ఇందులో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు చోటు లభించింది. పెద్దపల్లి జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కార్యక్రమాల కారణంగా ఆమెకు ఈ అవకాశం దక్కింది. బృందంలో ఆమెతోపాటు కేంద్ర తాగునీటి శాఖ సంచాలకుడు యుగల్ కిశోర్, జార్ఖండ్ పంచాయతీ రాజ్ కార్యదర్శి ఆరాధన, జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన కలెక్టర్ ఇందు ఉన్నారు.