ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూల్స్ అతిక్రమిస్తున్నా వాహనదారులు !

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2019, 01:41 PM

కరీంనగర్‌లో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అంతే వేగంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలని నిబంధనలను లెక్కచేయడం లేదువాహనదారులు  అతివేగం నియంత్రణకు పోలీసులు చలాన్‌ ద్వారా జరిమానా విధిస్తున్నా ఉల్లంఘనలు మాత్రం తగ్గడంలేదు. ఒకవైపు జరిమానా చెల్లిస్తూనే మరోవైపు ‘నో రూల్స్‌’ అంటూ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ట్రాపిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నా అవకాశం దొరికితే చాలు రూల్స్‌ అతిక్రమిస్తున్నారు. దీంతో ప్రతినెలా జరిమానాలు వీపరితీంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో 8 నెలల్లోనే రూ.10,27,09,200 జరిమాన వసూలవడమే ఇందుకు నిదర్శనం. హెల్మెట్‌ లేకుండా నమోదు అవుతున్నా కేసులు కూడా అధికంగా ఉంటున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com