ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెరాస ప్రభుత్వంపై సోమారపు సంచలన ఆరోపణలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2019, 05:52 PM

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెరాస ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో జల దోపిడీ జరుగుతోందని ,గతంలో ఆంధ్రవాళ్లు జల దోపిడీ చేస్తున్నారని కేసీఆర్ అన్నారని, అయితే ఇప్పుడు కేసీఆర్‌ పాలనలోనూ అదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. గోదావరి పరిసర ప్రాంతాలకు నీరు ఇవ్వకుండా ఎక్కడికో తీసుకెళ్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనవసరమైన రిజర్వాయర్లు కట్టి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలను జల దోపిడీ అనకుండా మరేమంటారని సత్యనారాయణ ప్రశ్నించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com