ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్ కసరత్తుపై అధికారులతో భేటీ ఐన సీఎం కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2019, 06:45 PM

గణేష్ నవరాత్రులు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్‌ మొదటి రెండు వారాల్లో బడ్జెడ్ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. సమావేశాల తేదీలు త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఆయా శాఖల నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్ కసరత్తుపై సీఎం కేసీఆర్ అధికారులతో భేటీ అయ్యారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు.. సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తోంది. 1 లక్షా 82 వేలా 17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్నెళ్ల ఖర్చుకు ఓటాన్ అకౌంట్ అనుమతి తీసుకొంది. ఇక ఇప్పుడు ఓటాన్ అకౌంట్ స్థానంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికశాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com