శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తీసుకువచ్చిన 26 బంగారు బిస్కెట్లని స్వాధీనం చేసుకు న్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద అధికారులు సుమారు మూడు కిలోల బరువుండే 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.1.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.