ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రేటర్లో నాలుగు రోజులు మంచినీళ్ల సరఫరా బంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2019, 07:09 PM

ఈనెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు గ్రేటర్లో నాలుగు రోజులు మంచినీళ్ల సరఫరా ఆగనున్నట్టు జలమండలి తెలిపింది. నిలిపివేత కొనసాగును. గండిపేట నుంచి ఆసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌ బెడ్‌కు నీటి తరలింపులో పైపులైన్‌ కాలువ మరమ్మతులు, ఆసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌ బెడ్‌ క్లీనింగ్‌ కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
26, 27 తేదీల్లో నీళ్లు రాని ప్రాంతాలు:
కాకతీయ నగర్‌, సాలార్జంగ్‌ కాలనీ, పార్ట్‌ పద్మనాభనగర్‌, కుందన్​బాగ్‌, వినయ్‌నగర్‌ కాలనీ, చింతల్‌బస్తీ, హుమాయున్‌ నగర్‌, సయ్యద్‌ నగర్‌, ఏసీ గార్డ్స్‌, ఖైరతాబాద్‌, మల్లేపల్లి, బోయిగూడ, అజంపుర, నాంపల్లి, దేవిబా గ్‌, అఫ్జల్‌ సాగర్‌, సీతారాంబాగ్‌, హబీబ్‌నగర్‌, ఎస్‌ఆర్‌టీ, జవహర్‌నగర్‌, పీఎన్‌టీ కాలనీ, సాయన్న గల్లీ, ఆశోక్‌నగర్‌, జ్యోతి నగర్‌, వినాయక్‌ నగర్‌, మైసమ్మ బండ, ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌, సెక్రటేరియట్‌, రెడ్‌హిల్స్‌, హిందీ నగర్‌, గోడెకీకబర్‌, గన్‌ఫౌండ్రీ, దోమలగూడ, లక్డీకపూల్‌, మణికొండ, పుప్పాలగూడ ఏరియాల్లో నీటి సరఫరా నిలిచిపోతుంది.
28, 29 తేదీల్లో నీళ్లు రాని ప్రాంతాలు:
కృష్ణా న‌ది నుంచి సిటీకి మంచి నీటిని త‌ర‌లిస్తున్న కృష్ణా ఫేజ్‌-1లో బండ్లగూడ వ‌ద్ద 2200 ఎంఎం పైపులైనుకు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీ అరిక‌ట్టేందుకు పైపులైనుకు మ‌ర‌మ్మతు ప‌నులను జ‌ల‌మండ‌లి చేపట్టనుంది. అందువల్ల ఆగస్టు 28న ఉద‌యం 6 గంట‌ల నుంచి 29న సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 36 గంట‌ల పాటు అలియాబాద్, మీరాలం, కిషన్ బాగ్, రియాసత్ నగర్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, అస్మాన్ ఘాడ్, చంచల్ గూడ, యాకుత్ పుర, మలక్ పేట్, మూసారాంబాగ్, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, హిందీనగర్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని అధికారులు వెల్లడించారు. అలాగే కృష్ణా ఫేస్–-2, ఫేస్‌-–3కి సంబంధించి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అందువల్ల 29న ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు భోజగుట్ట, మారేడ్ పల్లి, సైనిక్ పురిలో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లోని వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com