శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం గుత్తా సుఖేందర్రెడ్డితో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీ నర్సింహాచార్యులు గత సోమవారం అధికారికంగా ప్రకటించి.. గుత్తాకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. 2021 జూన్ మూడు వరకు గుత్తా ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.