అరుదైన వ్యాధితో బాధపడుతున్న పదిహేనేళ్ల బాలుడికి ప్రవాసులు అండగా నిలిచి ఆర్థిక సాయం అందజేశారు. హన్మకొండ నగరంలోని రెడ్డికాలనీకి చెందిన చెన్నం నితిన్సాయి (15) కొన్ని రోజులుగా అత్యంత అరుదైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స అందించేందుకు అతడి కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసినా ఫలితం లేకపోయింది. నితిన్ తండ్రి శ్రీనివాస్ స్నేహితులు సాయం అందించినా సరిపోలేదు. దీంతో చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలంటూ సోషల్ మీడియా ద్వారా దాతలను శ్రీనివాస్ వేడుకున్నారు. అబుధాబీ జాతీయ చమురు సంస్థ ఆద్నాక్లో ఇంజనీర్గా పనిచేస్తున్న హన్మకొండకు చెందిన రాజశ్రీనివాస్రావు విషయం తెలుసుకుని.. తన న్నేహితుల ద్వారా రూ.2.21 లక్షల విరాళాలు జమ చేశారు. ఆ మొత్తాన్ని హన్మకొండలో నితిన్కు అందజేశారు.