Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు
ప్రశ్న:కష్టాలలో ఉన్న ఏపీ కి, ఇప్పుడు అత్యవసరంగా రాజధాని మార్పు అవసరమా? కేవలం వ్యక్తిగత సాధింపుల కోసం ప్రజలని ప్రభుత్వమే ఇబ్బంది పెడుతోంది కదా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
- చంద్ర జీవన్ , విశాఖపట్నం
జవాబు: నిజమే జీవన్ గారు, రాష్ట్రము మధ్యలో రాజధాని ఉండాలన్నది గత ప్రభుత్వ తలపు. ఇప్పుడు దీనిని దోనకొండకో మరో చోటికో మార్చడం అంటే ఆర్ధిక భారం అంతా ఇంతా కాదు. ఇప్పటికే కేంద్రం రాజధాని నిర్మాణాలకు నిధులు విడుదల చేయడం లేదు. ఈ క్రమంలో రాజధాని తరలింపు వార్తలతో అమరావతిలో అలజడి రేగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా తమకు కౌలు చెల్లించకపోవడంతో ఆందోళనతో ఉన్న రైతులకు.. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో భయం పెరిగింది. ఇటు రాజధాని ప్రాంతంలో పనులు కూడా నిలిపివేయడంతో భూముల, పొలాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ సర్కార్ తీరుపై అసంతృప్తితో ఉన్న రాజధాని రైతులు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఇది జగన్ ప్రభుత్వానికి కాస్త సంకట స్థితి అనే చెప్పాలి.