పివి సింధు తన తల్లిదండ్రులతో కలిసి ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. బ్యాడ్మింటన్లో వరల్డ్ఛాంపియన్గా నిలిచిన పివి సింధు భారతజాతికే గర్వకారణమని వెంకయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన సింధును అభినందించారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్మెడల్ సాధించిన మొదటి మహిళా క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశంలోని యువతరానికి సింధు ఒక స్పూర్తిగా నిలిచిందన్నారు. సింధులాంటి క్రీడాకారులు దేశానికి అవసరమని ఆయన అన్నారు. పీవీ సింధు నేటి యువతరానికి రోల్మోడల్గా నిలిచిందని అన్నారు.