నిజామాబాద్ జిల్లా లోని స్థానిక మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేగడం సంచలనంగా మారింది. తనను ర్యాగింగ్ చేశారని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుకి వచ్చింది. ర్యాగింగ్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డీన్ కాలేజీ నుంచి తొలగించారు. ముగ్గురు విద్యార్థులు కాలేజీ హాస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు