బాలికను అత్యాచారం చేసిన ఇద్దరు కి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ సోమవారం ఎల్ బీనగర్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కుమార్తె(14)తో కలిసి 2012లో చింతల్ మెట్ లోని సులెమాన్ నగర్ కి వచ్చింది. అక్కడే కూలీ పనిచేస్తూ.. కూతురుని స్కూల్ కి పంపేది. అదే ఇంట్లో ఉండే మహిళ సోదరులు హస్నుద్దీన్(24), సలాలుద్దీన్(25)గ్యాస్ వెల్డింగ్, కార్పెంటర్లుగా పనిచేసేవారు. ఇంట్లోనే ఉంటున్న అక్క కూతురైన బాలికపై 2014లో హస్నుద్దీన్, సలాలుద్దీన్ ఇద్దరు కలిసి రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె తన సోదరులను మందలించింది. కొద్దిరోజులుగా బాలిక నీరసంగా ఉంటుండటంతో స్కూల్ టీచర్ అనుమానంతో సైబరాబాద్ చైల్డ్లైన్ పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు బాలికకు కౌన్సెలింగ్ ఇవ్వగా మేనమామలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారనే విషయాన్ని వారికి చెప్పింది. చైల్డ్లైన్ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులకు 2014 మార్చి7న కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారణలో భాగంగా సోమవారం ఎల్బీనగర్ కోర్టు జడ్జి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులు హస్నుద్దీన్, సలాలుద్దీన్లకు 10 ఏండ్ల శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 5వేల ఫైన్ విధిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.