మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావుతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో హరీశ్తో ఆయన సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో.. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై ఇద్దరి మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. మళ్లీ యూటర్న్ తీసుకున్న ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ కీలకనేత మంత్రి హరీశ్తో భేటీ కావడంతో కోమటిరెడ్డి కారుక్కుతారనే పుకార్లు వస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి మనసులో ఏముంది..? అసలు ఆయన పార్టీలోనే కొనసాగుతారా..? లేకుంటే పార్టీ మారతారా..? అసలేం జరుగుతోంది..? భేటీ వెనుక ఆంతర్యమేంటి..? అని కోమటిరెడ్డి అభిమానులు ఆలోచనలో పడ్డారని సమాచారం. కాగా.. ఈ ఇద్దరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.