నల్లమలలో యురేనియం పరిశోధనకు కాంగ్రెస్, టీఆర్ఎసే అనుమతి ఇచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తవ్వకాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మరకే కేంద్ర సంస్థలు రీసెర్చ్ చేస్తున్నాయని తెలిపారు. యురేనియం అనుమతి విషయంలో TRS డొంక తిరుగుడు సమాధానాలు చెబుతుందని ఆయన ఆరోపించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే తవ్వకాలు జరపేది లేదంటూ టీఆర్ఎస్ అసెంబ్లీలో తీర్మానం చేసిందని విమర్శించారు కిషన్ రెడ్డి.