ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2019, 02:16 PM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని యువతిని కొందరు దుండగులు పార్క్‌‌లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం... ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీలో మతిస్థిమితం లేని యువతి(23) కొద్దిరోజులుగా తిరుగుతోంది. దొరికింది తింటూ రోడ్డుపక్కనే పడుకుంటోంది. సెప్టెంబర్ 15వ తేదీ రాత్రివేళ స్థానిక ఇంద్రప్రస్థ పార్క్ సమీపంలో నిద్రపోతున్న యువతిని కొందరు వ్యక్తులు పలకరించారు. తమ వెంట వస్తే భోజనం పెడతామని నమ్మించి పార్క్‌లోని పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో చనిపోయిందని భావించి రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోయారు.సోమవారం ఉదయం బాధితురాలు అపస్మారక స్థితిలో ఒంటిపై బట్టలు లేకుండా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన డాక్టర్లు జననాంగాల వద్ద తీవ్ర గాయాలయ్యాయని, శరీరంపై పంటితో కొరికిన గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చాక వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపడతామని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com