యురేనియంపై త్వరలో మరో సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంపత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. గతంలో ఇలాంటి అంశాలపై అఖిలపక్షంలో అందరం పాల్గొన్నామన్నారు. సంపత్ వ్యాఖ్యలకు బాధపడుతున్నానన్నారు. తాను చొరవ తీసుకొని సమావేశం ఏర్పాటు చేయించానన్నారు.