ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2019, 04:32 PM

కామారెడ్డి పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకుడు కాటిపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ... 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ "ఆపరేషన్ పోలో" వల్ల నిజాం పాలనలో మగ్గుతు, రజాకారుల చేతిలో బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్న తెలంగాణ ప్రజలు విముక్తి పొందారని, రజాకార్లను ఎదురించి, తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ స్వాతంత్య్ర సాధనలో అమరులైన వీరులకు జోహార్లు అని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం కన్నా ముందు విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ స్వరాష్ట్ర సాధన తరువాత ఓటు బ్యాంకు రాజాకీయాల కోసం ఎంఐఎంకు తలొగ్గి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపటం లేదని అన్నారు.   










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com