సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలంలో బుధవారం ఉదయం విద్యార్థులు గత కొన్ని రోజులుగా సమయానికి బస్ రావడం లేదని కళాశాలలకు చాలా ఆలస్యంగా వెళ్ళడంతో ఇబ్బంది పడుతున్నామని బస్ ముందు ధర్నాకు దిగారు. తాము కళాశాలకు సమయానికి వెళలేకపోతున్నామని వాపోయారు. వెంటనే బస్ కండక్టర్ డిపోకు సమాచారం ఇవ్వగా డిపో మేనేజర్ ఫోన్ లో మాట్లాడుతూ... ఇక నుంచి సమాయనికి వస్తుందని విద్యార్థులకు మాట ఇచ్చారు. దానితో విద్యార్థులు నిరసన విరమించుకున్నారు.