సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో బుధవారం గ్రామా రెవెన్యూ అధికారులు, గ్రామా రెవెన్యూ సహాయకులు ధర్నా నిర్వహించారు. తాము రాత్రి పగలు కష్టపడి భూమి సమస్యలు పరిష్కారం చూపుతుంటే తమ పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, సమగ్ర కుటుంబ సర్వే నుండి నేటి భూ ప్రక్షాళన వరకు అన్నీ పనులు తమ కుటుంబాలను వదిలి పనిచేస్తున్నరని, ఒక్కొక్క గ్రామా రెవెన్యూ అధికారికి మూడు నాలుగు గ్రామాలతో నలిగి పోతున్నారని, సరిఅయిన సిబ్బందిని ఇవ్వాలని వారు వాపోతున్నారు. ఈ ధర్నాలో గ్రామా రెవెన్యూ అధికారుల మండల అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ఉపఆద్యక్షులు రమేష్, గ్రామా రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.