హైదరాబాద్ : పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు అమలులోకి తెచ్చామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ..ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువయ్యామన్నారు. దేశంలోనే షీ టీమ్స్ ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 331 షీటీమ్స్ పనిచేస్తున్నాయని అన్నారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించామన్నారు.