తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీదే హవా ఉంటుందని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ అన్నారు. సంపర్క్ అభియాన్లో భాగంగా తెలంగాణలో ముగ్గురు ప్రముఖులను కలిశానన్నారు. ఆర్టికల్ 370 ఆవశ్యకతను వివరించినట్లు పేర్కొన్నారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో రాష్ట్రాలు కలిసి నడవాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో నూతన ట్రెండ్ కనిపించిందని స్పష్టం చేశారు. తెలంగాణ, బెంగాల్, ఒడిశాలో బీజేపీ విజయకేతనం ఎగరేసిందని వెల్లడించారు. కేంద్ర ఆవాస్ యోజనను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడంలేదన్నారు. తెలంగాణలో పేదలకు ఇళ్లు అవసరంలేదా? అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ కూడా తెలంగాణలో అమలుకావడంలేదని విమర్శించారు. తెలంగాణలో రాజకీయం వేగంగా మారుతోందని వ్యాఖ్యానించారు.