తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన హుజుర్నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికకు సెప్టెంబర్ 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. ఉపసంహరణ అక్టోబర్ 3. ఇక పోలింగ్ ప్రక్రియ అక్టోబర్ 21. ఓట్ల లెక్కింపు 24న నిర్వహించనున్నారు.