తెలంగాణలో పలు భూకుంభకోణాలపై వీడియోలని ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం చేసిన మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు సమాచారం. ఇటీవల దళిత సంఘాలు. ఓ పాడుబడిపోయిన పాత కేసును తవ్వితీసి ఆ కేసు కారణంగా సర్కార్ ను ఇరుకున పడటంతో పాటు ప్రతిష్ట దెబ్బతినేలా ఈ ప్రసారాలున్నాయని భావిస్తూ, పోలీసులకు ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మల్లన్న ఇంటి చుట్టూ పోలీసు బలగాల్ని దించారని ఆతని సన్నిహితులు చెపుతున్నారు. కాగా ఈ కేసులో మల్లన్నను అరెస్టు చేస్తే, ఆతనికి మూడు నెలలు జైలు జీవితం తప్పదని, ఆ విధంగానే సర్కారు నేతలు ప్లాన్ చేసారంటూ ఆరోపణలు చేస్తున్నారు.