పోలీస్ అధికారులంతా కలిసి జిల్లా ప్రజలతో ముఖాముఖీ ఏర్పాటు చేసి సరికొత్త ప్రక్రియకు సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెరలేపారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గురించి ఆయన మీడియాకు వివరిస్తూ, జిల్లాలో ఎవరికైనా చట్టపరమైన సమస్యలు ఉన్నా, ఏవైనా కేసులలో ఇబ్బంది ఎదుర్కొంటున్నా స్వయంగా వారు ప్రతి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తనతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నమని చెప్పారు.
ఆరోజు జిల్లా పోలీసు ఉన్నతాధికారులందరూ ఎస్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, బాధితులకు సంబంధించిన సమస్యను సంబంధిత స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎస్పి హెగ్దే కోరారు.