హైదరాబాద్: ద్రవ్యవినిమయ బిల్లును ఆదివారం శాసనసభ, శాసనమండలి ఆమోదించనున్నాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే ద్రవ్యవినిమయ బిల్లును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెడతారు. చర్చ అనంతరం బిల్లును సభ ఆమోదిస్తుంది. అసెంబ్లీలో ఆమోదం పొందాక బిల్లు శాసనమండలికి వెళ్తుంది. అక్కడ చర్చ అనంతరం బిల్లును ఆమోదిస్తారు. శాసనమండలిలో మున్సిపల్, సివిల్కోడ్ బిల్లులను కూడా ఆమోదించనున్నారు. ఈ నెల 9న ప్రారంభమైన సమావేశాలు నేటితో ముగియనున్నాయి. శాసనసభ పదిరోజుల పాటు జరిగింది. బడ్జెట్ పద్దులపై సుదీర్ఘంగా చర్చించి వాటిని ఆమోదించారు.