హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.బస్సు నిండా ప్రయాణికులు ఉండటంతో బస్సును సురక్షితంగా పొలాల్లోకి తీసుకెళ్లి నిలిపివేసి డ్రైవర్ చనిపోయిన ఘటన కలకలం రేపింది. ధనజోడు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అక్కువరం దగ్గరకు వచ్చేసరికి డ్రైవర్కు గుండె పోటు రావడంతో చాకచక్యంగా వ్యవహరించి... బస్సును పొలాల్లోకి దింపి... డ్రైవర్ మృతి చెందాడు. ప్రయాణకులు సురక్షితంగా ఉన్నారు.