మెట్రో రైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక మృతి చెందిందని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద పెచ్చులు ఊడి పడి మృతి చెందిన మౌనిక కుటుంబ సభ్యులను కోదండరాం పరామర్శించారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. మౌనిక కుటుంబ సభ్యులను ఇప్పటి వరకు అధికారులు స్పందించక పోవడం దారుణమన్నారు. మౌనిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.